How To Create a Website

Mana Manthani web site కు విచ్చేస్తున్న Manthanites కి స్వాగతం సుస్వాగతం మరియు మరియు శుభాకాంక్షలు .. , No. 9246575261

Exit Poll Survey Results




 

 
 



Sl
No
Cast
Voters
Congress
Ch.Srinivas reddy

YSRCP
P. Shailaja
TRS
G.
Balaiah
Prasad
Oters
1.
Munooru Kapu
2200 to 2500





2
Bhramins
750 to 800





3
Reddy
250 to300





4
Vysyas
1390 to 1400





5
Mudiraj
500 to 550





6
Muslims
900 to 950





7
S.C  / S.T
1100 to 1150





8
Carpenters / Kummari
1150 to1200





9
Mangli / Chakali
700 to 725





10
Golla (Yadavs)
350 to 400





11
Padam Shali
800 to 850





12
Gouds
800 to 850






13
Others
400 to500













మన మంథని వెబ్ సైట్ Special Interview 
 పార్టీ మద్దతుదారుల గెలుపుతో అభివృద్ధి
- ప్రజల కోసం అనేక పథకాలు 
మన మంత్రి వర్యులు శ్రీధర్‌బాబు
మన మంథని వెబ్ సైట్ :, ప్రజా సంక్షేమం అభివృద్ధి కార్యక్షికమాలు చేపడుతున్న కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులను సర్పంచ్‌లుగా గెలిపించి, గ్రామాల్లో మరింత అభివృద్ధికి ప్రజలు బాటలు వేసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. గురువారం మంథనిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మన మంథని వెబ్ సైట్ (పంచాయతీ ఎన్నికల సర్వే బృందం)తో ఏర్పాటు చసిన ప్రత్యక సమావేశంలో మన మంత్రి వర్యులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్షికమాలు చేస్తోందని, పేదలకు ‘అమ్మహస్తం’ ద్వారా నిత్యావసర సరుకులను సబ్సిడీ రూపంలో అందిస్తున్నామన్నారు. బృణహత్యలు అరికట్టి ఆడ పిల్ల అంటే ఇంటికి భారం అనే భావన రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ‘బంగారు తల్లి’ పథకం ప్రవేశ పెట్టి, ఆడ పిల్లల తల్లిదంవూడులకు ఆసరా ఇస్తోందని చెప్పారు. 

విద్యార్థులకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం అనేక మార్పులు తీసుకువచ్చిందన్నారు. వసతి గృహంలో చదువుకుంటున్న వారికి అన్ని రకాల సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. మంథని ప్రాంతంలో సాగు నీటిని అందించేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయించి ఈ ప్రాంత రైతుల భూములను సస్యశ్యామలం చేస్తామన్నారు. గ్రామీణ స్థాయిలో సర్పంచ్‌లుగా తమకు సంబంధించిన వారు గెలుపొందితే సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చి త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

మంథని మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పార్టీ మద్దతు తెలుపుతున్న చంద్రుపట్ల శ్రీనివాస్‌డ్డి(పెదబాబు) గెలుపుతో మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందన్నారు. పట్టణంలో ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్షికమాలు చేపట్టామని, వీటిని కొనసాగించేందుకు పెదబాబును గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థిగా పెదబాబుకు కేటాయించిన పలక గుర్తును ఆవిష్కరించి ఆయనకు మద్దతుగా ఉప సంహకరించుకున్న కొండేల మారుతిని అభినందించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పనకంటి చంద్రశేఖర్, పీఏసీఎస్ చైర్మన్ ఎక్కెటి అనంతడ్డి, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు అజీంఖాన్, కొత్త శ్రీనివాస్, నాయకులు వొడ్నాల శ్రీనివాస్, బాసాని రాజయ్య, శశిభూషణ్‌కాచే, ఎడ్ల సత్యనారాయణ, సెగ్గెం రాజేష్, బొబ్బిలి శ్రీధర్, రామడుగు మారతిరావులు పాల్గొన్నారు.
19th July Survey Report
--------------------------------------------------------------------------------------
మన మంథని   లో కూడా పోటీ రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది.
ఇక్కడ పోటీ ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కు మధ్యే జరుగుతున్నది. కాంగ్రెస్ అభ్యర్థిగా చం దుపట్ల శ్రీనివాస్ రెడ్డి, వైసీపీ అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా కన్వీనర్ పుట్ట మధు సతీమణి పుట్ట శైలజ పోటీలో ఉన్నారు. తెలుగుదేశం అభ్యర్థిగా పేర్కొం టూ నామినేషన్ వేసిన అభ్యర్థి జమీల్ నలుగురు పిల్లలు కలిగి ఉండడంతో అతని నామినేషన్‌ను తిరస్కరించారు.
టీఆర్ఎస్ నుంచి గంట బాలయ్య రంగంలో ఉన్నా అతను ఇచ్చే పోటీ నామమాత్రంగానే భావిస్తున్నారు. తొమ్మిది మంది రంగంలో ఉన్నా పోటీ మా త్రం కాంగ్రెస్, వైసీపీ మ ధ్యే కావడంతో మంత్రి శ్రీధర్‌బాబుకు ఈ పంచాయతీ గెలుచుకోవడం ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పటికే రెండు రోజులుగా మంథనిలో మకాం వేసి ఆయన కాం గ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డిని గెలిపించేందుకు వ్యూ హ రచన చేస్తున్నారు.

గుర్తుల కేటాయింపుతో ప్రచారం ముమ్మరం

18th July Survey Report
--------------------------------------------------------------------------------------
మన మంథని(18th) లో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది....మొదటి విడత (23-07-2013) ఎన్నికలు జరగనున్న మంథని, డివిజన్ 7 మండలాలకు  అభ్యర్థులకు ప్రచారానికి ఆరు రోజులుమాత్రమే వుంది.
మొత్తం 9 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
ఎన్నికల గుర్తులు 
1. చందుపట్ల శ్రీనివాస్ రెడ్డ్డి ..... పలక 
2. పుట్ట శైలజ ..........................బ్రేష్
3. గంట బాలయ్య -------------....కుట్టు మిషిన్ 
4. అవధానుల హరి  ప్రసాద్--- .ఉంగరం 
5. అయిలి  సత్యనారాయణ ----బుట్ట 
6. ఇనుముల విజేత ------------కత్తెర 
7. గొబ్బరి సత్యనారాయణ రాజు ..బ్యాట్ 
8. జక్కుల చంద్రశేఖర్ -------........బల్ల 
9. నక్క రవి ....-----------------------టార్చ్ లైట్ 

17th July Survey Report
--------------------------------------------------------------------------------------
ఎన్నికల గుర్తులు విడుదల : 
మన మంథని : రేపు(17-07-2013) మధ్యాహ్నం 3 గంటల తర్వాత సర్పంచ్, వార్డు అభ్యర్థులకు గుర్తులు విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. నామినేషన్లను రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరించుకోవచ్చు అని ఆయన తెలిపారు. పోలింగ్‌కు 48 గంటల ముందు పాదయాత్రలు, ప్రచార కార్యక్రమాలు చేపట్టవద్దని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
 
16th July Survey Report
--------------------------------------------------------------------------------------
మన మంథని డివిజన్‌లోని ఏడు మండలాల్లో శనివారం సర్పంచ్‌లకు 353, వార్డులకు 9363, మొత్తంగా సర్పంచ్‌లకు 1607, వార్డులకు 3230 నామినేషన్లు దాఖలయ్యాయి.
మన మంథని డివిజన్‌లోని ఏడు మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన ఆదివారం ముగిసింది. టీడీపీ -అభ్యర్థి మండల కో ఆప్షన్ మాజీ సభ్యుడు ఖాజా మొహిజొద్దీన్ అలియాస్ జమీల్ అహ్మద్‌ కు నలుగురు సంతానం ఉన్నందున నామినేషన్ తిరస్కించడం జరిగింది - 

0 comments:

Post a Comment

  • VIDEOS
  • PHOTOS
  • NEWS UPDATE